ఏపీలో పట్టాలు తప్పిన రైలు..! కేకే లైన్ రూట్లో రాకపోకలకు ఇబ్బందులు!
Thu May 29, 2025 10:14 Others
అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తవలస-కిరండూల్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కలకలం రేగింది. బొర్రా-చిమిడిపల్లి మధ్య ఈ ఘటన జరగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇనుప ఖనిజంతో వస్తున్న రైలు బోగీలు సుమారు 20 నుండి 30 వరకు పట్టాలు తప్పాయని సమాచారం. కేకే లైన్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కొత్తవలస- కిరండూల్ (కేకే లైన్) మార్గంలో రైలు పట్టాలు తప్పింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య కొత్తవలస-కిరండూల్ (కేకే లైన్) మార్గంలో బుధవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరండూల్ నుంచి ఐరన్ ఓర్తో వస్తున్న రైలు బోగీలు పట్టాలు తప్పడంతో కేకే లైన్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 20 నుంచి 30 బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. కిరండూల్ నుంచి ఐరన్ ఓర్తో వస్తుండగా గూడ్స్ రైలుకు ప్రమాదం జరిగింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 53-34వ మైలు వద్ద ఈ ఘటన జరిగింది. సుమారు 20 నుంచి 30 వరకు బోగీలు పట్టాల మీది నుంచి ఒరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని రైల్వే అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. సరిగ్గా టన్నెల్ దాటే సమయంలో ప్రమాదం జరగడంతో కొన్ని బోగీలు సొరంగంలోనే ఉండిపోయాయి. బరువుతో వెళ్తున్న రైలు కావడంతో ఎక్కువ బోగీలు పట్టాలు తప్పాయి అంటున్నారు. రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. ఐరన్ ఓర్ ఉండటంతో పనులు కష్టంగా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా బుధవారం కిరండూల్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలును రాయగడ మీదుగా మళ్లించారు. ఇవాళ కూడా ఈ లైన్ మీదుగా నడిచే రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కేకే లైన్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని రైల్వే వర్గాలు అంటున్నాయి.
ఏపీ మీదుగా వీక్లీ స్పెషల్ రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడపనుంది. ఈ రైళ్లు జూన్ నుంచి జులై వరకు వివిధ తేదీల్లో అందుబాటులో ఉంటాయి.
విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలు నంబర్ 08581 జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు రైలు నంబర్ 08582 జూన్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం నడుస్తుంది.
విశాఖపట్నం నుంచి తిరుపతికి రైలు నంబర్ 08547 జూన్ 4 నుంచి జూలై 30 వరకు ప్రతి బుధవారం నడుస్తుంది. తిరుపతి నుంచి విశాఖపట్నంకు రైలు నంబర్ 08548 జూన్ 5 నుంచి జూలై 31 వరకు ప్రతి గురువారం నడుస్తుంది. విశాఖపట్నం నుంచి చర్లపల్లికి రైలు నంబర్ 08559 జూన్ 6 నుంచి జూలై 27 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. చర్లపల్లి నుండి విశాఖపట్నంకు రైలు నంబర్ 08580 జూన్ 7 నుంచి జూలై 26 వరకు ప్రతి శనివారం నడుస్తుంది.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విమాన ప్రయాణికులకు శుభవార్త! విశాఖ-భువనేశ్వర్ ఎయిర్ లింక్కు గ్రీన్ సిగ్నల్ !
5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్..! రివాల్యుయేషన్ పెట్టగా..!
ఎన్టీఆర్ జయంతి ఇకపై రాష్ట్ర పండుగ..! ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు..! సీఎస్ ఉత్తర్వులు జారీ!
అమెరికా మరో కీలక నిర్ణయం! విద్యార్ధి వీసా ఇంటర్వ్యూలకు తాత్కాలికంగా బ్రేక్..!
జగిత్యాల కోర్టు నుంచి పరారైన రిమాండ్ ఖైదీ! గల్ఫ్ మోసాల కేసులో..!
ఆర్ఆర్బీ రైల్వే ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? ఈ కీలక అప్డేట్ మీకోసమే..!
రూ.లక్షలోపు రుణమాఫీ.. వీరికి వర్తింపు! మార్గదర్శకాలు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #AndhraPradesh #TrainDerailed #KKLine #RailwayDisruption #TrainAccident #TravelAlert #APNews #RailwayUpdate #PassengerAlert
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.